కృష్ణా: ప్రతి శుక్రవారం పెడనలో జరిగే వారపు సంతకు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే మత్స్యకారులు, ఇతర వర్తకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వసతి సదుపాయం లేక స్థానిక బస్టాండ్లోనే రోజు గడపాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.17లక్షలను మార్కెట్ మార్కెట్ ఆధునికరణకు కేటాయించినప్పటికీ..నేటికీ అభివృద్ధి పనులు ప్రారంభించకపోవడంతో సంత కనుమరుగయ్యే ప్రమాదంలో ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.