ఎన్టీఆర్: దేశవ్యాప్తంగా ఈనెల 9వ తేదీన తారీఖు జరుగు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ విస్సన్నపేట బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కార్మిక సంక్షేమాన్ని నిలుపుదల చేసే ప్రభుత్వాల ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని సంక్షేమ బోర్డును ప్రారంభించాలని డిమాండ్ చేశారు.