ఎన్టీఆర్: కొందరు పిల్లలు బడిబాట మరిచారు. విస్సన్నపేటలో ఓ విచారకర దృశ్యం కంటపడింది. జంగాల సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి, తన కుమారుడితో కలిసి భిక్షాటన చేస్తూ కనిపించాడు. ఎందుకని మైనర్ బాలుడితో భిక్షాటన చేస్తున్నావని అడిగితే.. ఇది తమ సంప్రదాయమని సమాధానమిచ్చాడటా. మైనర్ బాలల జీవితాలు నాశనమవుతున్నాయని, పిల్లలు బడిబాట పట్టేలా ప్రభుత్వాలు చొరవ చూపాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.