ఎన్టీఆర్: అక్రమంగా కలప నరికిన కేసులో నిందితులకు నందిగామ కోర్టు 14రోజులు రిమాండ్ విధించింది. కంచికచర్ల మండలం పరిటాల శివారులోని ఉమా హైలాండ్స్లోని కలపను పేరకలపాడు గ్రామ వైసీపీ అధ్యక్షుడు అక్రమంగా నరికాడు. అధ్యక్షుడుతో సహా 9మంది ముద్దాయిలపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై బోన గిరి రాజు తెలిపారు. నిందితులను నందిగామ కోర్టులో హాజరుపరచగా..ముద్దాయిలకు నందిగామ కోర్టు 14జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు ఎస్సై వెల్లడించారు.