కృష్ణా: గన్నవరంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చోరీ జరిగిందని కార్యాలయ సిబ్బంది గుర్తించారు. కార్యాలయంలోని బీరువా పగలగొట్టి, విలువైన డాక్యుమెంట్లు, స్టాంపులను దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటనపై సబ్ రిజిస్ట్రార్ గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.