ఎన్టీఆర్: ఏపీపీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆరేళ్లుగా పెండిగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 4, 5 తేదీల్లో ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నామని విజయవాడ జోన్ కార్యదర్శి వై.శ్రీనివాసరావు తెలిపారు. అన్ని డిపోలలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.