ఎన్టీఆర్: విసన్నపేటలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం ప్రారంభమైంది. కూటమి నాయకులు పట్టణంలోని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు నెక్కళపు వెంకటేశ్వరరావు, బీజేపీ మండల అధ్యక్షుడు మధు కొంగల తదితరులు పాల్గొన్నారు.