ఎన్టీఆర్: నందిగామలోని కాకాని నగర్లో ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో ఆమె ఆదేశాలతో ‘సుపరిపాలనలో-తొలి అడుగు’ కార్యక్రమంపై అవగాహన సదస్సు జరిగింది. విజయవాడ పార్లమెంట్ CUBఇన్ఛార్జ్ షేక్.ఖాజా, నియోజకవర్గ పరిశీలకులు సుబ్రమణ్యం,వీరబాబు, కంచికచర్ల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ వెంకటసత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ కృష్ణకుమారి పాల్గొన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రం ధ్వంసమైందని వారు విమర్శించారు. కూటమిప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలకు తెలియజేయాలన్నారు.









