కృష్ణా: పెదపారుపూడి మండల కేంద్రంలో సోమవారం ఉదయం నీటి సంఘం అధ్యక్షుడు కాగితం లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సాగునీరు దిగువ ప్రాంతాలకు విడుదల అయ్యేలా పూడికతీత పనులు చేపట్టారు. వెంట్రప్రగడ సౌత్ ఛానల్ నుంచి సాగునీరు వానపాముల, జమీదింటకుర్రు, పెదపారుపూడి, బేతవోలు పొలాల వరకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చివరి పొలాల వరకు సాగునీరు అందించడమే లక్ష్యమని ఆయన అన్నారు.