ఎన్టీఆర్: జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు ఆదేశాలతో పోలీసు కమిషనరేట్ పరిదిలోని అన్నీ పోలీస్ స్టేషన్లు, టాస్క్ ఫోర్స్ అధికారులు రౌడీ షీటర్లు, క్రైమ్ సస్పెక్ట్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తిని విడనాడి, సత్ప్రవర్తనతో జీవించాలని, గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా నిరోధించాలని సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, నిఘా ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు.