AP: కృష్ణా జిల్లా ఉయ్యూరు డిపోకు చెందిన బస్సులో ఓ మహిళా కండక్టర్ వృద్ధుడిపై దాడి చేసింది. తోట్లవల్లూరులో బస్సు ఎక్కిన పెద్దిబోయిన మల్లిఖార్జునరావు రూ.200 నోటు ఇవ్వడంతో చిల్లర విషయంలో ఇరువురు గొడవపడ్డాడు. పెద్ద నోటు ఇచ్చావని ఆగ్రహించిన కండక్టర్, వృద్ధుడిని బస్సులోంచి దింపి దుర్భాషలాడుతూ దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.