Locations: Krishna

  • టీసీల జారీలో జాప్యం.. తల్లిదండ్రుల పడిగాపులు

    ఎన్టీఆర్: కంకిపాడు మండలంలోని పునాదిపాడు జడ్పీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పదో తరగతి పాసైన విద్యార్థులకు టీసీలు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది దురుసుగా సమాధానం ఇస్తున్నారని చెబుతున్నారు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా పాఠశాల వద్ద పడి కాపులు కాస్తున్నామని వాపోతున్నారు.

     

     

  • ‘ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉంది’

    ఎన్టీఆర్: టీడీపీ ఎల్లప్పుడూ ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు దశరథ జనార్ధన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లింల పక్షపాతి అని ఆయన పేర్కొన్నారు. త్వరలో ముస్లిం సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి సంక్షేమంలో దూసుకెళుతుందని జనార్ధన్ తెలిపారు.

  • అమరావతి అభివృద్ధికి సలహాలు ఇవ్వండి.. CRDA విజ్ఞప్తి

    అమరావతి అభివృద్ధి విషయంలో ప్రజల నుంచి CRDA సూచనలు, సలహాలు కోరింది. APCRDA విజన్-2047 పేరుతో ఆన్‌లైన్‌లో ప్రశ్నావళి రూపొందించింది. అమరావతి ప్రాంత ప్రజలు భాగస్వామ్యులై తమ ఆలోచనలు, సూచనలు ప్రాధాన్యతలు, అభిప్రాయాలు చెప్పాలని కోరింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాల్లోని 56మండలాల పరిధిలో సీఆర్డీఏ విస్తరించిందని వెల్లడించింది. ఈమేరకు పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించింది.

  • ‘టెన్నిస్ ప్లేయర్ సాకేత్‌కు గ్రూప్-1 పోస్టు’

    ఎన్టీఆర్: అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనికి రాష్ట్రప్రభుత్వం అరుదైన గౌరవాన్ని చేకూర్చిందని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. సాకేత్ మైనేనికి
    గ్రూపు-1 పోస్టును కేటాయిస్తూ కేబినేట్ సమావేశంలో ఆమోదించడం హర్షదాయకమన్నారు. రవినాయుడు మీడియాతో మాట్లాడుతూ క్రీడలు, క్రీడాకారుల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనడానికి ఇదే నిదర్శనమన్నారు. గ్రూప్-1పోస్టును పొందిన సాకేత్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

     

     

  • వీరబాబుని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

    కృష్ణా: కోడూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన విస్సంశెట్టి వీరబాబు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకున్నారు. మంగళవారం అవనిగడ్డ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు వారి ఇంటి వద్ద వీరబాబున పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వివిధ హోదాలలోని ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

     

     

  • ఏపీలో డ్రగ్స్‌కు చోటు లేదు : ఈగల్ చీఫ్

    ఎన్టీఆర్: రాష్ట్రంలో డ్రగ్స్‌కు చోటు లేదని ఈగల్ చీఫ్ రవికృష్ణ అన్నారు. డ్రగ్స్ నియంత్రణపై విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. డ్రగ్స్ అమ్మినా, కొన్నా, రవాణ చేసినా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. డ్రగ్స్ ఫ్రీ ఏపీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈగల్ అడుగులు వేస్తోందన్నారు. డీసీపీ సరిత పాల్గొన్నారు.

  • ‘డ్రోన్ నిఘాతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట’

    ఎన్టీఆర్: విజయవాడ తూర్పు నియోజకవర్గం గురునానక్ కాలనీలోని ఎన్‌సీసీ ఫంక్షన్ హాల్‌లో పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో 9 కాలనీల్లో సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో సీపీ రాజశేఖర్ బాబు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొని, రిమోట్ ద్వారా కెమెరాలను ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ రూమ్, డ్రోన్ నిఘాతో అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకుంటున్న సీపీ రాజశేఖర్‌ను ఎంపీ ప్రశంసించారు.

  • నాగులూరులో కాలనీ పేరు వివాదం

    ఎన్టీఆర్: రెడ్డిగూడెం మండలం నాగులూరులో కాలనీ పేరు వివాదం రాజుకుంది. టీడీపీ హయాంలో ఇళ్ళు కట్టించిన విజయబాబు పేరును తొలగించాలని వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ప్రతిగా, వైసీపీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయని, అధికారులు తమను కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు. విజయబాబు కాలనీ పేరు మార్చి, జగజ్జీవన్ రామ్ పేరు పెట్టాలని కొందరు వివాదాన్ని రేపుతున్నారని వాపోయారు.

  • పాఠశాలలో పౌష్టికాహారంపై తనిఖీ

    కృష్ణా: ఉయ్యూరులో మండల విద్యాశాఖాధికారి ఆకస్మిక తనిఖీ చేశారు. వెలగపూడి రామకృష్ణ మెమోరియల్ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించారు. ఆహారంలో లోపాలు, గుడ్ల పంపిణీ, పౌష్టికాహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నామని, దీని కోసం ప్రత్యేక ఉపాధ్యాయుడిని నియమించామని తెలిపారు.

  • నారాయణను కలిసిన జనార్థన్ రెడ్డి

    ఎన్టీఆర్: విజయవాడలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణను ఆయన నివాసంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఇరువురు నేతలు చర్చించారు.