ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాల చెరువుకు వరద వచ్చినప్పుడల్లా మద్దులమ్మ డొంక దారిపై నీరు చేరి ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఈ మార్గంలో వ్యవసాయ పనులకు వెళ్లేందుకు వీలు కావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రధాన దారి నుంచి డొంక దారికి చప్టా నిర్మించాలని ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా..ఫలితం లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.