కృష్ణా జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ కార్యక్రమం కింద 54 గ్రామాలను గుర్తించినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఆయా గ్రామాల్లో పారిశుధ్యం, మరుగుదొడ్లు, అన్ని సౌకర్యాలు కల్పించి ఆదర్శంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర బృందం పర్యటించి వాటికి రేటింగ్ ఇస్తుందన్నారు. మంచి ర్యాంకు సాధించేందుకు లోటుపాట్లు సరిచేయాలని అధికారులకు సూచించారు.