ఎన్టీఆర్: ఇటీవల కురిసిన భారీ వర్షానికి కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రామికనగర్(కొత్తగేటు) ఏరియాలో కొండ వాగు ఉధృతంగా ప్రవహించడంతో 50ఇళ్లు ముంపునకు గురయ్యాయి. ఈవిషయాన్ని కొండపల్లి మున్సిపాలిటీ వైసీపీ ఫ్లోర్ లీడర్ గుంజ శ్రీనివాస్
మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా..వారు స్పందించకపోవడంతో తానే స్వయంగా సొంత నిధులు వెచ్చించి కొండ వాగు నీటి మళ్లింపు చేపట్టారు. దీంతో స్థానికులు శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలియజేశారు.