ఎన్టీఆర్: తిరువూరు నగర పంచాయతీ 9వ వార్డులోని ప్రైవేట్ ఖాళీ స్థలాలు పల్లంగా ఉండటంతో మరుగు నీరు చేరి దోమలు, విష సర్పాల పెరుగుదలకు కారణమవుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా స్థలాల్లో పిచ్చి చెట్లను తొలగించి శుభ్రం చేయాలని వార్డ్ కౌన్సిలర్ దుర్గారావు ఆదేశించారు. లేనియెడల స్థల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.