ఎన్టీఆర్: ఎమ్మెల్యే రాజగోపాల్వర్మ తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం సూపర్సిక్స్ పథకాలలో భాగంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేసిందన్నారు. విద్యార్థుల కళ్లల్లో ఆనందాన్ని చూడటం కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. చదువుకునే పిల్లలకి తల్లికి వందనంతో పాటు పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్లు, తదితర వస్తువులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.