కృష్ణా: తల్లికి వందనం పథకం డబ్బులు రూ.13వేల చొప్పున ఇంట్లో ఎంత మంది చదువుకునే విద్యార్ధులుంటే అంత మందికి తల్లుల అకౌంట్లలో జమ కావడం పట్ల గుడివాడలో మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. గుడివాడ జనసేన నాయకులు పవన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవనకళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకి పాలాభిషేకం నిర్వహించారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్ల పేర్లు చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతాయని కొనియాడారు.