ఎన్టీఆర్: జగ్గయ్యపేట పట్టణంలో బలుసుపాడు రోడ్డులో గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రధాన మంత్రి స్కూల్స్ రైజింగ్ ఆఫ్ ఇండియా ఫండ్స్ రూ.24లక్షలతో ప్లే గ్రౌండ్ అభివృద్ధి పరిచేందుకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన కెమిస్ట్రీ ల్యాబ్ను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుజాత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.