ఎన్టీఆర్: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన కంచికచర్లలో చోటుచేసుకుంది. లారీ విడిభాగాల దుకాణం, లారీలు నిర్వహిస్తున్న గ్రామానికి చెందిన దేవిరెడ్డి నాగరాజు(38) గురువారం సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద నీటిలో నాగరాజు మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
Locations: Krishna
-
క్రికెట్ టోర్నీ విజేతగా చిట్టిపాలెం సీఎస్కే
కృష్ణా: పెడనలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న క్రికెట్ పోటీల్లో చిట్టిపాలెం సీఎస్కే జట్టు విజేతగా నిలిచింది. చివరి రోజు చిట్టిపాలెం సీఎస్కే, డీటీపాలెం సోల్జియర్స్ పోటీపడగా.. చిట్టిపాలెం సీఎస్కే విజయం సాధించింది. విజేత, రన్నరప్ జట్లకు మున్సిపల్ 19వ వార్డు కౌన్సిలర్ చిరువెళ జయేశ్ బహుమతులు అందజేశారు.
-
ఫాథర్ మరియ సాగర్కు ఘనంగా వీడ్కోలు
కృష్ణా: పెద పారిపూడి మండలం వెంట్రప్రగడ విచారణ గురువు ఫాథర్ మరియ సాగర్ బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఫ్యారిష్ పరిధిలోని 12గ్రామాల సంఘ పెద్దలు, విశ్వాసులు ఆయనకు శుక్రవారం వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. పాథర్ను శాలువాతో ఘనంగా సత్కరించారు. మూడేళ్లపాటు సంఘాల్లో దేవుని పరిచర్యను, దేవాలయ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. సడన్గా ట్రాన్స్ఫర్ అవడాన్ని యువత జీర్ణించుకోలేపోయింది.
-
ఉప్పులేటి దేవీ ప్రసాద్కు ఘనంగా సత్కారం
ఎన్టీఆర్: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI) రాష్ట్ర అధ్యక్షులు మాజీ IRS ఆఫీసర్ ఉప్పులేటి దేవీ ప్రసాద్ను టీడీపీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి పరిశపోగు రాజేష్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన దేవీప్రసాద్కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సత్కరించారు.
-
యువత వాటికి దూరంగా ఉండాలి: దేవినేని
ఎన్టీఆర్: గుంటుపల్లిలో చెరుకూరి నరసింహారావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిత జిల్లాస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. 62జట్లు పాల్గొనగా, అమ్మా క్యారెట్స్ (పోరంకి) విజేతగా, గుంటుపల్లి యూత్ సీసీ రన్నర్గా నిలిచాయి. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్రోఫీలు అందజేశారు. యువత చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉండి క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని దేవినేని అన్నారు.
-
ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్
- నవాబుపేట క్రాస్ రోడ్ వద్ద ఆటోను ఢీకొన్న కారు.. ఒకరి మృతి
- విజయవాడలో శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ కిడ్నాప్ కేసు సుఖాంతం
- దోనబండ వద్ద లారీ భీభత్సం.. తృటిలో తప్పిన ప్రమాదం
- మసులా బీచ్ ఫెస్టివల్లో హెలీ రైడ్స్ ప్రారంభం
-
ఆటోను ఢీకొన్న కారు.. ఒకరి మృతి
ఎన్టీఆర్: పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్ ఆటోను కారు ఢీకొనడంతో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
ప్రజల సహచరుడిగా ఉంటా: MLA
కృష్ణా: గుడివాడ సహచరుడిగా ఉంటూ ప్రజలకు మంచి చేయడంలోనే నాకు సంతోషమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజలు అర్జీలు అందించేందుకు పోటెత్తారు. అత్యధిక సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రజా వేదిక కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటుందని, ప్రజల సహచరుడిగా సమస్యలు తీర్చడంలో సంతోషం ఉందని ఎమ్మెల్యే రాము తెలిపారు.
-
‘పేదలకు అండగా సీఎం సహాయనిధి’
కృష్ణా: పేదలకు అండగా సీఎం సహాయనిధి నిలుస్తుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పెడన నియోజకవర్గంలోని పలువురు పేదలకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని(CMRF చెక్కులు) తోటమూల టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
-
‘బీసీలకు అన్యాయం చేస్తున్నారు’
కృష్ణా: విశ్వవిద్యాలయ ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ విధానాన్ని పాటించకుండా బీసీలకు అన్యాయం చేస్తున్నారని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శేకుబోయిన సుబ్రహ్మణ్యం ఆరోపించారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు నూటికి 25శాతంతో పాటు జనరల్ కోటాలో మరికొన్ని ఉద్యోగాలు రోస్టర్ విధానాన్ని అమలు పరచడం ద్వారా ఇవ్వాలన్నారు. రోస్టర్ విధానాన్ని పక్కాగా అమలు పరచకపోతే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.