కృష్ణా: ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. శనివారం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని రాము ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా ఆసుపత్రి ప్రధాన విభాగాలకు వెళ్లి రికార్డులు తనిఖీ చేశారు. ఓపి, మందుల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. వైద్య చికిత్సలపై రోగులుతో మాట్లాడారు. వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు.
Locations: Krishna
-
శివాజీ విగ్రహ ఆవిష్కరణకు సామినేనికి ఆహ్వానం
ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభానుని చత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనాలని కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఉదయభాను ఆయన స్వగృహంలో శనివారం కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. జగ్గయ్యపేట హిందూ చైతన్య వేదిక వారి ఆధ్వర్యంలో ఈనెల 9న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం చత్రపతి శివాజీ మహారాజ్ జ్ఞాపకను కమిటీ సభ్యులు అందజేశారు.
-
సీఎంకు నెట్టం కృతజ్ఞతలు
కృష్ణా జిల్లా సహకార కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్(KDCC) ఛైర్మన్గా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీరఘురామ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
-
త్యాగానికి ప్రతీక బక్రీద్: MLA
ఎన్టీఆర్: జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీకని అన్నారు. శనివారం జగ్గయ్యపేట పట్టణం బలుసుపాడు రోడ్డులోని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తాతయ్య పాల్గొని ముస్లింలను కలిసి అలింగనం చేసుకుని మత సామరస్యాన్ని చాటారు.
-
రేపు మద్దులమ్మకు వరదపాశం
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామ సమీపంలోని రిజర్వు ఫారెస్ట్లో స్వయంభుగా వెలసిన మద్దులమ్మకు గ్రామస్తులు ఆదివారం వరదపాశం పోయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి పరిటాల, నక్కలం పేట, కంచికచర్ల, నరసింహారావు పాలెం గ్రామాలతో పాటు పలు గ్రామాలు ప్రజలు హాజరుకానున్నారు. వర్ష ప్రదాయిని అయిన మద్దులమ్మ తల్లికి వరదపాశం పోస్తే వర్షాలు కురుస్తాయని ఇక్కడి స్థానికుల నమ్మకం.
-
విజేతలకు శ్రీరాం తాతయ్య సత్కారం
ఎన్టీఆర్: ఒంగోలులో గత నెల 31 నుంచి ఈనెల 2 వరకు పురుషులు, మహిళలకు 12వ సబ్-జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ పవర్లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. జగ్గయ్యపేటకు చెందిన జి.వెంకటేశ్వరావు మాస్టర్స్ గోల్డ్ మెడల్ & స్ట్రాంగ్ మెన్ టైటిల్, ఎస్.ప్రహర్షిణి సబ్ జూనియర్ గోల్డ్ మెడల్ సాధించారు. వీరితో పాటు పతకాలు సాధించిన విజేతలను ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య శనివారం సత్కరించారు.
-
చెస్ ఇన్ స్కూల్లో చెవిటికల్లు గ్రామ వాసి ఉత్తమ ప్రతిభ
ఎన్టీఆర్: ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్క్రాట్స్ ఫైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈనెల 3,4 తేదీల్లో చెస్ ఇన్ స్కూల్ సెమినార్ నిర్వహించారు. కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామానికి చెందిన చెస్ కోచ్ గుజ్జర్లపూడి చెన్నకేశవులు అత్యుత్తమ ప్రతిభ కనపరచాడు. సందర్భంగా గుజరాత్కు చెందిన ఇండియన్ చెస్ 11వ గ్రాండ్ మాస్టర్ తేజెస్ బక్రీ కేశవులును ఘనంగా సన్మానించారు. షీల్డ్, ప్రశంశా పత్రంతో అభినందించారు.
-
తిరుపతమ్మకు వెండి చెంబు వితరణ
ఎన్టీఆర్: పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానానికి లింగగూడెం గ్రామానికి చెందిన మాదినేని నాగేష్ కుటుంబ సభ్యులు శనివారం 100 గ్రాములు మిశ్రమ వెండి చెంబు వితరణ చేశారు. వీరికి దేవస్థానం ఏఈఓ, టెంపుల్ ఇన్స్పెక్టర్ అమ్మవారి దర్శన ఏర్పాటు చేశారు. వేద పండితులచే వేద ఆశీర్వచనం అమ్మవారి శేష వస్త్రములు, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
-
త్యాగానికి ప్రతి రూపమే బక్రీద్: దేవీ ప్రసాద్
ఎన్టీఆర్: ముస్లిం సోదర, సోదరీణులకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, మాజీ IRS ఆఫీసర్ ఉప్పులేటి దేవీప్రసాద్ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ త్యాగానికి ప్రతీకని చెప్పారు. ఉన్న దానిలో ఇతరులకు పంచి పెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని బక్రీద్ నేర్పుతుందన్నారు. సమస్యలకు వెరవకుండా, దేవుడిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనాన్ని సాగించాలనే సందేశం ఇస్తుందని వెల్లడించారు.
-
ఇంద్రకీలాద్రిపై ‘యోగాంధ్ర’
ఎన్టీఆర్: ఇంద్రకీలాద్రిపై శనివారం ఉదయం ‘యోగాంధ్ర’ జరిగింది. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా మానసిక ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని, దీనిని నిత్యచర్యగా అలవాటు చేసుకోవాలని దుర్గగుడి ఈవో శీనా నాయక్ సూచించారు. ఈ కార్యక్రమం ఆలయ వాతావరణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.