ఎన్టీఆర్: రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన మహిళా రైతుల గురించి సాక్షి టీవీలో అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీటీవీ జర్నలిస్ట్ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు ప్రసారం చేసిన సాక్షి టీవీ యజమాని భారతి రెడ్డిపై, కొమ్మినినేని, కృష్ణంరాజుపై కంచికచర్ల పోలీస్ స్టేషన్లో ఆదివారం కూటమి మహిళా నేతలు ఫిర్యాదు చేశారు.
Locations: Krishna
-
కొండపల్లి ఛైర్మన్ ఎన్నిక వాయిదా?
ఎన్టీఆర్: సోమవారం జరగాల్సిన కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా వేసినట్లు సమాచారం. కారణాలు ఏమనే విషయాలు తెలియాల్సి ఉంది. ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కొండపల్లి మున్సిపల్ ప్రజలు మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.
-
లక్ష్యం నెరవేరుతోంది: బుద్ధ ప్రసాద్
కృష్ణా: నాగాయలంకలో జల క్రీడల శిక్షణా కేంద్రం నిర్మాణ లక్ష్యం నెరవేరుతోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఆదివారం శిక్షణా కేంద్రం నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. అనంతరం నాగాయలంకలో వసతి గృహాలు పరిశీలించారు. బీసీ బాలికల వసతి గృహాలను రూ.15.50 లక్షలు, సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాలను రూ.7.60 లక్షలతో నిర్మిస్తున్నారు.
-
సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్న సత్యప్రకాష్
కృష్ణా: మోపిదేవి గ్రామంలో భక్తులచే విశేష పూజలు అందుకుంటున్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ప్రముఖ సినీనటుడు సత్య ప్రకాష్ ఆదివారం దర్శించుకున్నారు. వీరికి దేవాలయం వద్ద ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం సత్యప్రకాష్ను శ్రీరామ వరప్రసాదరావు సత్కరించి, ప్రసాదాలు అందజేశారు. అర్చకులతో కలిసి శ్రీ స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు.
-
గుడివాడకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం: వెనిగండ్ల
కృష్ణా: గుడివాడ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ఆదివారం విద్యుత్ అధికారులతో రాము సమావేశమై విద్యుత్ సమస్యలపై సమీక్షించారు. సమస్యలపై ప్రణాళికలు రూపొందించారు. పరిష్కారానికి అధిష్టానం నుంచి నిధులు తీసుకొస్తానని ఈ సందర్భంగా రాము హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిన్న, చిన్న సమస్యలు పెద్దవిగా మారి ప్రజలు కష్టాలు పడుతున్నారని తెలిపారు.
-
కృష్ణంరాజు వ్యాఖ్యలతో వైసీపీకి సంబంధం లేదు : పోతిన
ఎన్టీఆర్: జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నేత పోతిన మహేష్ స్పష్టం చేశారు. విజయవాడలో మాట్లాడుతూ కావాలనే టీడీపీ, వారి సోషల్ మీడియా, ఎల్లో మీడియా వైసీపీపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదని హితవుపలికారు. ఇప్పటికే సాక్షి టీవీ యాజమాన్యం కూడా కృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండించిందని వెల్లడించారు.
-
ట్రాక్టర్ షోరూమ్ ప్రారంభించిన తంగిరాల
ఎన్టీఆర్: నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో నూతనంగా ఐషర్ ట్రాక్టర్ షోరూమ్ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలసి ఆదివారం ప్రారంభించారు. ఈ సంద్భంగా ట్రాక్టర్ షోరూమ్ యాజమాన్యాన్ని సౌమ్య అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
-
సలహాలు తీసుకుంటే తప్పేంటి..? : సీపీఐ రామకృష్ణ
ఎన్టీఆర్: రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి సీఎం చంద్రబాబు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలో మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులను వదిలేసి కొత్త ప్రాజెక్టుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తే తెలంగాణ మాదిరిగానే నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టినప్పుడు సలహాలు తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.
-
మద్దులమ్మకు వరద పాయసం పోసిన సౌమ్య
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామ సమీపంలోని రిజర్వు ఫారెస్ట్లో స్వయంభుగా వెలసిన మద్దులమ్మకు ఆదివారం వరద పాయసం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మద్దులమ్మకు వరద పాయసం పోశారు. వరద పాశం పోస్తే వర్షాలు కురుస్తాయని ఇక్కడి ప్రజల నమ్మకమని సౌమ్య తెలియజేశారు. పరిటాల, నక్కలంపేట, కంచికచర్ల, నరసింహారావు పాలెంతో పాటు పలు గ్రామస్తులు హాజరయ్యారు.
-
అక్రెడిటేషన్లు ఇవ్వాలని మంత్రులకు వినతి
కృష్ణా: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు త్వరలోనే అక్రెడిటేషన్లు మంజూరు చేస్తామని మంత్రి కొలుసు పార్ధసారథి తెలిపారు. శనివారం రాత్రి మంగినపూడి బీచ్ ఫెస్టివల్లో పాల్గొన్న మంత్రులు పార్థసారధి, నారాయణకు జర్నలిస్టుల సమస్యలపై APMPA తరుఫున వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులు అక్రెడిటేషన్ విషయంలో పలు ఇబ్బందులకు గురయ్యారని, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సమస్యలు పరిష్కరించి అక్రెడిటేషన్లు మంజూరు చేయాలని కోరారు.