Locations: Krishna

  • ‘జగ్గయ్యపేటను పచ్చని పట్టణంగా తీర్చిదిద్దుదాం’

    ఎన్టీఆర్: ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని మున్సిపల్ చిల్డ్రన్ పార్క్‌లో ‘వమహోత్సవం-2025’ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సహకరిస్తేనే ప్రకృతి పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. జగ్గయ్యపేటను ఒక పచ్చని పట్టణంగా తీర్చిదిద్దుదామని ఆయన పిలుపునిచ్చారు.

  • అభివృద్ధి పథంలో నడిపిస్తా: కాగిత

    కృష్ణా: కూటమి ప్రభుత్వ అధికారం చేపట్టి ఏడాది అయిన సందర్భంగా పెడనలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. గతంలో వైసీపీ చేసిన అన్యాయాలను అరికట్టేందుకే కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

  • ఆంధ్రాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నంలో కూటమి ప్రభుత్వం ఏర్పాడి ఏడాది గడిచిన సందర్భంగా పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. రోడ్డున పోతుంటే కుక్కలు ఎన్నో మొరుగుతాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో శ్రమిస్తున్నారన్నారు. ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటామన్నారు.

  • వెన్నుపోటు పార్టీ YCPనే!

    కృష్ణా: కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా కంకిపాడులో జనసైనికుల వేడుకలు జరిపారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జనసేన జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రాము మాట్లాడుతూ.. నరకాసుర పాలన అంతమయ్యే సుపరిపాలన మొదలైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 13,326గ్రామాల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించిన ఘనత కూటమికే దక్కిందన్నారు.  వైసీపీనే వెన్నుపోటు పార్టీ అని ఎద్దేవా చేశారు.

  • ‘రెడ్‌బుక్‌లో నీ పేరు ఉంది.. గుర్తుపెట్టుకో’

    ఎన్టీఆర్: మరికొన్ని రోజుల్లో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ జైలుకు వెళ్లబోతున్నాడంటూ కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షుడు చుట్టుకొదురు శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. ‘రెడ్‌బుక్‌లో నీ పేరు ఉంది. గుర్తుపెట్టుకో’ అని జోగిని శ్రీనివాస్ హెచ్చరించారు. ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో జోగి మాటలకు ‘నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే భవిష్యత్ ఉండదు’ అని శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.

     

  • ఆ జిల్లాల అలర్ట్.. అక్కడ ఉక్కపోత.. అక్కడ వర్షాలు!

    గుంటూరు: రేపు విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 40-41°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

  • 9న కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక

    ఎన్టీఆర్: కొండపల్లి మునిసిపాలిటీగా ఏర్పడి మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరగగా 2021 నవంబర్‌లో కొండపల్లి మునిసిపాలిటీ ప్రజలు ఇచ్చిన తీర్పుతో నేటికీ కొండపల్లి మునిసిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల ఎన్నిక ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడు ఆ ఎన్నికకు అడ్డంకులు తొలగిపోయాయి. ఎట్టకేలకు కోర్టు ఆదేశాల మేరకు కొండపల్లి మునిసిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల ఎన్నిక ఈనెల 9న కొండపల్లి మునిసిపాలిటీ కార్యాలయంలో జరగనుంది.

  • ‘మైలవరంలో రైల్వే సమస్యలను పరిష్కరించాలి’

    ఎన్టీఆర్: మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న రైల్వే స‌మ‌స్య‌ల‌పై విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్(చిన్ని)తో కలసి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు డివిజ‌న‌ల్ రైల్వే మేనేజ‌ర్ న‌రేంద్ర ఎ.పాటిల్‌తో విజయవాడలోని డీఆర్ఎమ్ కార్యాల‌యంలో బుధవారం స‌మావేశమయ్యారు. నియోజ‌క‌వ‌ర్గంలో నెల‌కొన్న రైల్వే స‌మ‌స్య‌ల‌ను ఎంపీతో కలసి ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ప్ర‌స్తావించారు.

  • రేషన్ షాపుల్లో తహసీల్దార్ తనిఖీలు

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని తుమ్మలపాలెం, ఇబ్రహీంపట్నంలో రేషన్ షాపులను తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు బుధవారం తనిఖీ చేశారు. సక్రమంగా రేషన్ పంపిణీ చేస్తున్నారో? లేదో? తెలుసుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్లకు వెళ్లి రేషన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

  • వైసీపీ వెన్నుపోటు రాజకీయాలపై ఎమ్మెల్యే వెనిగండ్ల ఫైర్

    కృష్ణా: వైసీపీ వెన్నుపోటు రాజకీయాలపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నన్ని రోజులు వ్యవస్థలన్నిటిని సర్వనాశనం చేసిన వ్యక్తులు, ఇంకా సిగ్గు తెచ్చుకోకుండా రోడ్లపైకి వచ్చి డ్రామాలాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు అంటూ నిరసనలు చేస్తున్న వైసీపీ వాళ్లు..20ఏళ్లుగా గుడివాడ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే చేసిన మోసపూరిత, వెన్నుపోటు రాజకీయాలపై సమాధానం చెప్పగలరా అని ఎమ్మెల్యే రాము ప్రశ్నించారు.