ఎన్టీఆర్: తిరువూరు శివారు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గంజాయి పట్టుబడింది. బైక్పై వస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు సెక్టార్-1 ఎస్సై సత్యనారాయణ తెలిపారు. దాడుల్లో తహశీల్దార్ కాళీ లక్ష్మీ పాల్గొన్నారు.
Locations: Krishna
-
‘ఇది కూటమి ప్రభుత్వం కాదు.. కుట్రల ప్రభుత్వం’
ఎన్టీఆర్: ఇది కూటమి ప్రభుత్వం కాదు.. కుట్రల ప్రభుత్వం అని మాజీ మంత్రి, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ అన్నారు. మైలవరంలో వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాన్ని జోగి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు సూపర్ సిక్స్ పేరిట రాష్ట్ర ప్రజలను నిట్టనిలువునా ముంచాడని విమర్శించారు.
-
‘సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచురిస్తే చర్యలు’
కృష్ణా: నిజా నిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలను సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచురిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని బందరు డీఎస్పీ సీహెచ్.రాజా తెలిపారు. ఏదైనా ఒక విషయం ప్రచారం చేసేముందు అది వాస్తవమైనదా కాదా అని నిజనిర్ధారణ చేసుకుని ప్రచురించాలని, కల్పితమైనవి, అవాస్తవమైనది ప్రచురించి ప్రజల్లో అపోహలు, భయాందోళనలు రేకెత్తించేలా వ్యవహరిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని హెచ్చరించారు.
-
పొంచి ఉన్న ముప్పు!
ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం ప్రసాద్ నగర్లోని ప్రసాద్ కొట్టు వీధిలో నివాసాల మధ్య మురుగు ప్రజలకు శాపంగా మారింది. ఖాళీ స్థలాల్లో మురుగునీటి తటాకంతో దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విజృంభిస్తున్నాయి. పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. స్థానికులు వ్యాధుల భయంతో వణుకుతున్నారు. నాలుగేళ్ల క్రితం మెదడువాపుతో బాలుడి మృతిపై మరింత భయాందోళన చెందుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని నివాసితులు కోరుతున్నారు.
-
‘చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు’
ఎన్టీఆర్: నందిగామలో ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీగా RDO కార్యాలయానికి చేరుకుని అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. నాడు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, నేడు నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు.
-
‘రమణ స్ఫూర్తితో పార్టీ శ్రేణులు పనిచేయాలి’
ఎన్టీఆర్: ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ 26వ వర్ధంతి సందర్భంగా కంచికచర్ల పట్టణంలో నిర్వహించిన కార్యక్రమాల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. వెంకటరమణ, ఆయన సతీమణి ప్రణీత చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. రమణ స్ఫూర్తితో పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.
-
‘దేవినేని వెంకటరమణ ప్రజల మనసు గెలుచుకున్నారు’
ఎన్టీఆర్: మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ 26వ వర్ధంతి సందర్భంగా కంచికచర్లలో నిర్వహించిన కార్యక్రమాల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టీడీపీ శ్రేణులు దేవినేని వెంకటరమణ, ఆయన సతీమణి ప్రణీత చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు. అనంతరరం ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. దేవినేని వెంకటరమణ మంత్రిగా అతి తక్కువ కాలంలో ప్రజల మనస్సులను గెలుచుకున్నాని పేర్కొన్నారు.
-
వారిని వదిలే ప్రసక్తే లేదు : దేవినేని అవినాష్
ఎన్టీఆర్: ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ప్రశ్నించారు. విజయవాడలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గ సర్కిల్-3 కార్యాలయంలో సూపరింటెండెంట్ బీఎస్ఆర్కే ప్రసాద్కు మెమెరాండం ఇచ్చారు. కూటమి మోసాలపై మెమెరాండం ఇద్దామని వస్తే తహశీల్దార్ సెలవుపెట్టి వెళ్లిపోయారని ఆరోపించారు. తప్పుచేసిన ఏ అధికారిని, నాయకుడిని వదిలే ప్రసక్తే లేదన్నారు.
-
సుపరిపాలన మొదలై ఏడాది!
ఎన్టీఆర్: సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమాన్ని బుధవారం ఉదయం విజయవాడ తూర్పు నియోజక వర్గంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా రంగవల్లులు వేసిన మహిళలని వారు అభినందించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు అమ్మిశెట్టి వాసు, తదితరులు పాల్గొన్నారు.
-
జగ్గయ్యపేటలో ‘వెన్నుపోటు దినం’
ఎన్టీఆర్: జగ్గయ్యపేటలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరావు ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గం నుంచి భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా వైసీపీ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహశీల్దార్కు వైసీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.