కృష్ణా జిల్లాలో మసులా బీచ్ ఫెస్టివల్కు ఉచిత బస్ సర్వీసులను కొల్లు ఫౌండేషన్ వారు ఏర్పాటు చేశారు. ఈనెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న బీచ్ ఫెస్టివల్కు లక్షలాదిగా ప్రజలు తరలి రానున్నట్లు అధికారులు తెలిపారు. చింతచెట్టు సెంటర్, కోనేరుసెంటర్, కాలేఖాన్పేట, మూడు స్థంభాల సెంటర్, బస్టాండ్, లక్ష్మీటాకీస్ సెంటర్ నుంచి బస్ సౌకర్యం కల్పించామన్నారు.
Locations: Krishna
-
ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్
- జగనే నిజమైన వెన్నుపోటు దారుడు : కొలికపూడి
- కృష్ణా జిల్లాలో మసూల బీచ్ ఫెస్టివల్.. వన్-వే ట్రాఫిక్ అమలు: ఎస్పీ
- ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్ లక్ష్మీశ
- ఈనెల 20న IRCS సమావేశం: కలెక్టర్ బాలాజీ
- దక్షిణ మధ్య రైల్వే విజయవాడ TRD విభాగానికి ISO ధ్రువపత్రం
-
జగనే నిజమైన వెన్నుపోటు దారుడు : కొలికపూడి
ఎన్టీఆర్: ఏపీ రాజకీయాల్లో నిజమైన వెన్నుపోటు దారుడు మాజీ సీఎం జగన్ మాత్రమేనని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విమర్శించారు. తిరువూరులో మాట్లాడుతూ ‘‘సొంత పార్టీ కార్యకర్తలకు కూడా వెన్నుపోటు పొడిచింది జగనే. వైఎస్సార్ ఫ్యామిలీకి 45 సంవత్సరాల రాజకీయం జీవితం ఇచ్చిన రాయలసీమ ప్రాంతానికి జగన్ నీటి ప్రాజెక్టులకు ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టాడా’’ అని ప్రశ్నించారు.
-
మసూల బీచ్ ఫెస్టివల్.. వన్-వే ట్రాఫిక్ అమలు
కృష్ణా జిల్లాలో నిర్వహించనున్న మసూల బీచ్ ఫెస్టివల్ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టారు. ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు వన్-వే ట్రాఫిక్ అమల్లో ఉంటుందన్నారు. చల్లపల్లి, విజయవాడ నుంచి వచ్చేవారు చిలకలపూడి, తపసిపూడి మీదుగా మంగినపూడి బీచ్ చేరాలన్నారు. భీమవరం నుంచి వచ్చేవారు పెదపట్నం, తాళ్లపాలెం మార్గంలో రావాలన్నారు.
-
రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు..రయ్రయ్
ఎన్టీఆర్: రాయనపాడు రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. రైల్వేస్టేషన్ను త్వరలోనే ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన రైల్వేస్టేషన్ల తరహాలోనే రాయనపాడు అభివృద్ధి చెందుతుండటంతో విజయవాడ రైల్వేస్టేషన్పై ఒత్తిడి తగ్గుతుందన్నారు.
-
పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్
ఎన్టీఆర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు సంక్షేమ, అభివృద్ధి పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కనీస మద్దతు ధరకు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, ఆన్లైన్ యాప్ ద్వారా విక్రయాలు, నాణ్యమైన పశు దాణా తయారీ, రైతుసేవా కేంద్రాల ద్వారా సరైన ధరలతో ఎరువుల సరఫరా తదితర సేవలను రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
-
IRCS సమావేశం 20న: కలెక్టర్
కృష్ణా: ఈనెల 20వ తేదీన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ(IRCS) కృష్ణా జిల్లా శాఖ వార్షిక సాధారణ సమావేశం జరుగుతుందని జిల్లా కలెక్టర్, సొసైటీ అధ్యక్షుడు డీకే. బాలాజీ తెలిపారు. మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే సమావేశం అనంతరం నూతన జిల్లా మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు.
-
రైల్వే TRD విభాగానికి ISO ధ్రువపత్రం
AP : దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ (TRD) విభాగానికి ప్రతిష్ఠాత్మక ISO 9001:2015 సర్టిఫికేషన్ లభించింది. హైదరాబాద్లోని హర్ష టెక్నాలజీస్ నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి విజయవాడ డివిజన్కు ఈ సర్టిఫికేషన్ను ఇచ్చింది. భారతీయ రైల్వేలలోనే TRD విభాగానికి ధ్రువీకరణ పొందిన మొదటి డివిజన్గా విజయవాడ డివిజన్ గుర్తింపు పొందింది.
-
పోలీస్ స్టేషన్ ఎదుటే పాడుపని.. అడ్డంగా బుక్కయ్యారు!
కృష్ణా: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అవనిగడ్డ ఎస్సై శ్రీనివాస్ హెచ్చరించారు. అవనిగడ్డ పోలీస్స్టేషన్ ఎదుట తనిఖీలు చేపట్టగా, మోపిదేవి మండలం పెదకల్లేపల్లికి చెందిన కుతాడ వెంకన్నకు సంబంధించిన 2,500 కిలోలు, అవనిగడ్డకు చెందిన కోసూరు రాజారావుకు చెందిన 2,000కిలోల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి, రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
-
కొండపల్లి రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు కృషి చేస్తా: ఎమ్మెల్యే
ఎన్టీఆర్: కొండపల్లి రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు తన వంతు కృషి చేస్తానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే స్టేషన్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)తో కలిసి ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు. కృష్ణప్రసాదు మాట్లాడుతూ.. కొండపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి ఆవశ్యకతను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయించి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.