ఎన్టీఆర్: నందిగామ పట్టణంలో మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన ఘటన కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు పోస్టాఫీసు ఎదురుగా నిలుచున్న మహిళ మెడలో నుంచి చైన్ లాక్కుని పల్సర్ బైక్పై పరారయ్యారు. వరుస దొంగతనాలతో పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత ఆరు నెలలుగా దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.