కృష్ణా: చికిత్స పొందుతూ రోడ్డు ప్రమాద బాధితుడు మృతిచెందాడు. గత నెల 5న కంకిపాడు మండలం పునాదిపాడు రోడ్డులో బైక్ అదుపుతప్పి తీవ్ర గాయాలపాలైన గూడవల్లికి చెందిన కొలుసు సుబ్బారావు (58) సోమవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.