ఎన్టీఆర్: సీపీఐ మాజీ ఆల్ ఇండియా కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి మరణానికి విస్సన్నపేట మండల కమిటీ సంతాప సభ నిర్వహించింది. మండల కార్యదర్శి త్యాగరాజు మాట్లాడుతూ.. నల్గొండలో జన్మించి, ప్రజాపోరాటాలతో ఎంపీ, రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగిన ఆయన సీపీఐ జెండా నీడలోనే మరణించారని, ఆయన మార్గాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.