ఎన్టీఆర్: కంచికచర్ల పట్టణంలోని సెంట్రల్ బ్యాంక్ రోడ్లో శ్రీగణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో నందిగామ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వెలగా వేణుబాబు, ప్రెస్క్లబ్ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రెస్ క్లబ్ సభ్యులను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు కాకాణి సుమన్ పాల్గొన్నారు.