Locations: Krishna

  • దీన్ని ఎవరైనా రోడ్డంటారా?

    కృష్ణా: ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామం దూసరపాలెంలో రోడ్లు, డ్రైనేజీల పరిస్థితి దారుణంగా ఉంది. రైతులు పొలాలకు వెళ్లే మార్గం కాలినడకన కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఈమార్గం గుండా వందల ఎకరాలకు వెళ్లాలంటే, పండించిన పంటను ఎడ్ల బండితో బయటకు తీసుకురావాలంటే రైతులు నానా యాతన పడుతున్నారు. సంబంధిత అధికారులు గ్రావెల్ రోడైనా వేయించి అన్నదాతలకు బాసటగా నిలవాలని రైతులు కోరుతున్నారు.

     

  • కేసును తప్పుదోవ పట్టిస్తే కఠినచర్యలు: సీఐ

    కృష్ణా: తోట్లవల్లూరు మండలం యాకమూరులో ఈనెల 28వ తేదీన మహిళపై ఐదుగురు వ్యక్తులు మద్యం మత్తులో దాడి చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు నిష్పక్షపాతంగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నప్పటికీ..కేసును తప్పుదోవ పట్టించే విధంగా కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రవర్తిస్తున్నారని సీఐ చిట్టిబాబు వెల్లడించారు. అసభ్య పదజాలాలతో కులాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారికి కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

     

     

  • ఈ నెలలో వృద్ధులకు రేషన్ ఎక్కడ?

    ఎన్టీఆర్: రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు నెలలో నాలుగు రోజులు ముందుగా రేషన్ అందజేయాలని ఆదేశించినప్పటికీ రెండు మాసాలు ఇచ్చిన రేషన్ డీలర్లు ఈనెలలో ఇంతవరకు బియ్యం అందజేయలేదు. అదేమంటే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని చెబుతున్నారు.  జిల్లా రెవెన్యూ అధికారులు స్పందించి నందిగామ ఆర్డీవోకు కంచికచర్ల తహశీల్దార్‌కు వెంటనే వృద్ధులకు బియ్యం పంపిణీ చేయమని ఆదేశించినప్పటికీ..నెల ముగిసిన అందిచలేదని స్థానికులు వాపోతున్నారు.

     

  • బోలెం నాగమణికి కీలక బాధ్యతలు

    కృష్ణా: చల్లపల్లి మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు బోలెం నాగమణి రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా బోలెం నాగమణి నియమితులయ్యారు. ఈ ఆమెకు పార్టీ నాయకులు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. తమ నియామకానికి కారకులైన సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, తదితరులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

  • వ్యక్తి అనుమానాస్పద మృతి.. అతడేనా..?

    ఎన్టీఆర్: ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి చెందిన సంఘటన వత్సవాయి గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు పది రోజుల క్రితం వత్సవాయి గ్రామంలో బావిలో శవమై తేలిన మృతురాలి భర్త సైదులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • పదవి నీదా.. నాదా..?

    కృష్ణా: బంటుమిల్లి మండల టీడీపీ అధ్యక్ష పదవి నియామకంపై ఎప్పుడూ లేని రీతిలో పోటీ నెలకొంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ముంజలూరుకు చెందిన కూనపురెడ్డి వీరబాబు మరోసారి ఆపదవి తనకే కావాలంటూ పట్టుబడుతున్నారు. ఆయనపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉండటంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు మద్దతివ్వడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. మరోవ్యక్తి న్యాయవాది రంగనాథ్‌పై సానుకూల అభిప్రాయం ఉండటం గమనార్హం.

     

  • బైక్‌ను ఢీకొన్న లారీ.. మహిళ మృతి

    ఎన్టీఆర్: నందిగామలోని వై జంక్షన్ వద్ద దంపతులు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అందించిన సమాచారం మేరకు స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలు ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండకు చెందిన నాగమల్లేశ్వరిగా పోలీసులు గుర్తించారు. భర్తకు తీవ్ర గాయాలు,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

     

  • ఇబ్రహీంపట్నంలో నటి తన్మయి సందడి

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నంలో జబర్దస్త్ కామెడీ షో, పలు సినిమాలలో నటించిన నటి తన్నాయి హల్చల్ చేశారు. ఖాజీ మన్యంలో ఏర్పాటుచేసిన గణేష్ విగ్రహ మండపం వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మండప నిర్వహకులు తన్మయిని సన్మానించారు‌. కార్యక్రమంలో హరిబాబు, బాబావాలి, శ్రీనివాసరావు, ధీరజ్, చరణ్, న్యాయవాది నాగ పవన్, తదితరులు పాల్గొన్నారు.

  • అట్టహాసంగా వినాయకుని నిమజ్జన ఊరేగింపు

    ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపాలిటీలో వినాయక చవితి సందర్భంగా మండపాలలో మూడు రోజుల పాటు ఘనంగా పూజలు జరిగాయి. శనివారం వినాయకుడు నిమజ్జనానికి ఊరేగింపుగా బయలుదేరాడు. ఇందిరా కాలనీలో ఇబ్రహీంపట్నం క్రైమ్ ఎస్ఐ సేనాపతి శ్రీనివాస్ పూజల్లో పాల్గొన్నారు. మండప నిర్వహకులు వారిని సన్మానించారు. ఇందిరా నగర్‌లో లడ్డు వేలంలో ఆవులూరి రెడ్డి 20,100 రూపాయలకు లడ్డులు గెలుచుకున్నారు.

  • ‘ఛోటా న్యూస్ ఎఫెక్ట్’.. స్పందించిన అధికారులు

    ఎన్టీఆర్: మైలవరం మండలం వెల్వడంలో పారిశుధ్య లోపంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆరు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న పారిశుధ్య కార్మికుల సమస్యపై ‘ఛోటా న్యూస్‌’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వెంటనే చర్యలు చేపట్టి, కార్మికులకు ఆరు నెలల బకాయిలలో మూడు నెలల జీతాన్ని చెల్లించారు. దీంతో కార్మికులు తిరిగి విధుల్లోకి చేరి పారిశుధ్య సమస్యను పరిష్కరించారు.