ఎన్టీఆర్: నందిగామలో వాసవి మార్కెట్ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి కల్యాణ మహోత్సవం శోభాయమానంగా జరిగింది. వేద మంత్రాల మధ్య ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు, నృసింహాచార్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు. సహస్రనామార్చన, లక్ష్మీనారాయణ హోమం ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరామ్ రాజగోపాల్ పాల్గొన్నారు.
Locations: Krishna
-
పడవలో కూర్చొని సీపీఎం నేతల వినూత్న నిరసన
ఎన్టీఆర్: బుడమేరు వరద ముంపునకు రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించాలంటూ విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో పడవలో కూర్చొని వినూత్న నిరసన తెలిపారు. బుడమేరు ముంపు నివారణలోను, సహాయ చర్యలలోనూ ప్రభుత్వ విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆరోపించారు. ఏడాది క్రితం ఇదే సెంటర్లో వరదల్లో పడవల్లో ప్రయాణించాల్సి వచ్చిందన్నారు. మరోసారి ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
-
ఎమ్మెల్యేను సత్కరించిన మిల్క్ డైరెక్టర్ నగేష్
కృష్ణా: పెడన మండలం పెనుమల్లి గ్రామంలో గణపతి నవరాత్రులు సందర్భంగా అన్నసమారాధనలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం నగేష్ ఇంటి దగ్గర ఆరోసారి జిల్లా పాలకవర్గ సభ్యులుగా ఎన్నికైనందుకు కృతజ్ఞతగా ఎమ్మెల్యేకు నగేష్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు శీరం ప్రసాద్,ఊసా మారుతీ, సమ్మెట రాంబాబు, కాట్రగడ్డ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
-
ఘంటసాలలో ఘనంగా గణపతి మహోత్సవాలు
కృష్ణా: ఘంటసాల మండలంలో గణపతి మహోత్సవాలు సందర్భంగా వినాయకుని విగ్రహాలకు భక్తులు భక్తిశ్రద్ధలు విశేషపూజలు జరిపారు. శనివారం తాడేపల్లి, కొత్తపల్లి, చిట్టూర్పు గౌడపాలెం, తదితర గ్రామాల్లో ఏర్పాటుచేసిన గణపతి విగ్రహాలకు టీడీపీ సీనియర్ నాయకుడు పరుచూరి సుభాష్ చంద్రబోస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడేపల్లి,కొత్తపల్లి ఎస్సీ కాలనీలోనూ, చిట్టూర్పు గౌడపాలెం గ్రామంలోనూ ఆలయ కమిటీల ఆధ్వర్యంలో గణపతి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
-
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన టీడీపీ నేతలు
కృష్ణా: ఘంటసాల మండలంలో తాడేపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని టీడీపీ సీనియర్ నాయకుడు పరుచూరి సుభాష్ చంద్రబోస్ శనివారం ప్రారంభించారు. టీడీపీ నాయకుడు పరుచూరి సుభాష్ చంద్రబోస్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్లు శివప్రసాద్, లిల్లీపాల్, శ్వేత, పవన్కుమార్ ఆధ్వర్యంలో రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
-
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ టాబ్లెట్స్ అమ్మితే చర్యలే..!
ఎన్టీఆర్: మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని ఏసీపీ దామోదర్ మెడికల్ షాప్ యజమానులను హెచ్చరించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా అమ్మకాలు ఉంటే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. NRX ఔషధాల అమ్మకాలపై కఠిన నియమాలు పాటించాలని ఆదేశించారు.
-
‘పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషించాలి’
ఎన్టీఆర్: వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషించాలని సూచించారు. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, నియోజకవర్గ సమన్వయకర్తల కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని అవినాష్ పిలుపునిచ్చారు.
-
గుడివాడలో మాజీ మంత్రుల భేటీ
కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు శనివారం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గుడివాడలోని మాజీ మంత్రి కొడాలి నాని ఇంటికి పేర్ని నాని వెళ్లారు. కోర్టు షరతుల మేరకు ఈరోజు కొడాలి నాని వన్టౌన్ పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయనున్నారు. ఈ క్రమంలో పేర్ని నాని గుడివాడకు వచ్చినట్లు తెలుస్తోంది.
-
గోవులను కబేళాలకు తరలిస్తున్న పట్టించుకోని అధికారులు!
కృష్ణా: హనుమాన్ జంక్షన్ బాపులపాడు పశువుల సంత నుంచి వేల గోవులను కబేళాలకు తరలిస్తున్నారని, అధికారులు, రాజకీయ నాయకులు సిండికేట్గా లంచాలతో పోలీస్స్టేషన్లను దాటిస్తున్నారని గో పరివార్ జేఏసీ అధ్యక్షుడు సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్కూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదు కోసం జిల్లా ఎస్పీ సహాయంతో చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం గోశాలల ఏర్పాటుతో గోవుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
-
ఘనంగా సింహాచల లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
ఎన్టీఆర్: నందిగామలో వాసవి మార్కెట్ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సింహాచల లక్ష్మీనరసింహస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. సింహాచలం నుంచి స్వామివారి ప్రచార రథం నందిగామకు చేరుకుంది. నందిగామ గాంధీ సెంటర్ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మీ శ్రీనివాస కల్యాణం ఘనంగా జరిగింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పదివేల మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు.