ఏలూరు: గణనాథుడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండి సుఖ సంతోషాలతో జీవించాలని, విగ్నేశ్వరుని దయతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పాడి పంటలతో ప్రజలంతా సంతోషంగా జీవించాలని మంత్రి పేర్కొన్నారు. విగ్నేశ్వరుని దయ రాష్ట్రంపై, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉండాలని తద్వారా మంచి పరిపాలన అందించాలన్నారు.