కృష్ణా: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకవైపు నీరు సరైన సమయానికి రాకపోగా, వచ్చిన నీరు కూడా పురుగులు, మురుగు వాసనతో వస్తుండటంపై నగర ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఐదు, పది నిమిషాలపాటు మాత్రమే నీరు రావడం వల్ల కుటుంబాల అవసరాలు తీరక సమస్యలు మరింత తీవ్రతరమయ్యాయని మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ ఖండించారు.