Locations: Krishna

  • కలెక్టరేట్ ఎదుట దివ్యాంగుల ధర్నా

    కృష్ణాజిల్లా కలెక్టరేట్ ఎదుట దివ్యాంగుల JAC ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. పెన్షన్ల తొలగింపును నిరసిస్తూ దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెన్షన్ల రీ వెరిఫికేషన్‌ను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్‌కి వినతిపత్రం ఇచ్చారు. దివ్యాంగులకు అన్యాయం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమిస్తామని వైసీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ రాజు వెల్లడించారు.

  • పేదవారి ఇల్లు కూల్చడమేనా P4 : వెల్లంపల్లి

    ఎన్టీఆర్: విజయవాడ జోజినగర్ కరెంట్ ఆఫీస్ రోడ్డులోని 42 ఫ్లాట్ల యజమానులతో కలిసి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిరసన వ్యక్తంచేశారు. కోర్టును తప్పుదోవ పట్టించి స్థలాన్ని కబ్జాచేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. మున్సిపల్ ప్లాన్, బ్యాంక్ లోన్ వంటి అన్ని అనుమతులతో నిర్మాణం జరిగిందన్నారు. జనసేన పార్టీ నేతలే కబ్జాకు పాల్పడుతున్నారని.. పేదవారి ఇల్లు కూల్చడమేనా P4 అంటే అని ప్రశ్నించారు.

  • గణేష్ మండపాలకు అనుమతి తీసుకోవాల్సిందే: సీఐ

    ఎన్టీఆర్: గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. వినాయక చవితిని మత సామరస్యానికి ప్రత్యేకగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పారు. డీజేలతో, ట్రాఫిక్ ఆంక్షలతో ఎవరికీ ఇబ్బంది కలిగించ వద్దన్నారు. గణేష్ నిమజ్జనం రోజున అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ సభ్యుల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే పర్మిషన్ కాన్సిల్ చేస్తామన్నారు.

  • సహకార సంఘాల పాత్ర కీలకం: కోగంటి

    ఎన్టీఆర్: రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని కంచికచర్ల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ అన్నారు. సోమవారం గొట్టుముక్కల గ్రామంలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. సత్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన పాలకవర్గసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమంలో సహకార సంఘాల పాత్ర కీలకమన్నారు. గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

  • పడగ విప్పుతున్న పాములు

    ఎన్టీఆర్ జిల్లాలో పాముకాట్ల సంఖ్య పెరుగుతోంది. విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రికి బాధితులు క్యూ కడుతున్నారు. ఈఏడాది ఏడు నెలలకు 214 మంది పాముకాటుకు గురికాగా, 210 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. నలుగురు మరణించారు. తాచుపాము, కట్లపాము కాటువేస్తే కొంత సమయం తర్వాత చేతులు, కాళ్ల కదలికలు ఆగిపోతాయని వైద్యులు చెబుతున్నారు. రక్తపింజర కాటు వేసిన 30 నిమిషాల్లో ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించాలని, లేకపోతే ప్రమాదకరమన్నారు.

  • కుటుంబ పెద్ద వివరాలతో స్మార్ట్ రేషన్ కార్డ్

    కృష్ణా: రేషన్‌ కార్డుల స్థానంలో కూటమి ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులను బంటుమిల్లి మండలం ముంజులూరు గ్రామంలో పంపిణీ చేశారు. సోమవారం పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గ్రామంలో పర్యటించి లబ్ధిదారులకు అందజేశారు. స్మార్ట్‌ రేషన్‌ కార్డుపై కుటుంబ పెద్ద ఫొటో, పూర్తి వివరాలతో పాటు కుటుంబసభ్యుల పేర్లు వుంటాయి.

  • పేరకలపాడులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామంలో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. సర్పంచ్ మన్నె సాత్విక హాజరై గ్రామస్తులకు అందజేశారు. కార్డులపై ప్రభుత్వ రాజముద్ర, కుటుంబసభ్యుల వివరాలు, క్యూఆర్‌ కోడ్‌ ఉంటాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

  • అన్నదాతల అభ్యున్నతికి కృషి: వెనిగండ్ల

    కృష్ణా: అన్నదాతల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలం వెనుతురుమిల్లి గ్రామ PACS కమిటీ ప్రమాణస్వీకారం సోమవారం ఘనంగా జరిగింది. అనంతరం ఛైర్మన్‌గా కొప్పినేని పిచ్చిఈశ్వరరావు, డైరెక్టర్లుగా కట్టా శ్రీనివాసరావు, అల్లూరి బుజ్జిబాబు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే రాము శుభాకాంక్షలు తెలిపారు.

  • తొలి స్మార్ట్ రైస్ కార్డు పంపిణీ

    AP: రేషన్ పంపిణీలో అక్రమాలు అరికట్టడానికి స్మార్ట్ కార్డులు అందుబాటులోకి తెచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడ రమేష్ ఆసుపత్రి సమీపంలో వరలక్ష్మీ కాలనీలో ఆయన స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ .. నేటి నుండి సెప్టెంబర్ 15 తేదీ వరకూ ఈ పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

  • హోంగార్డ్‌పై జనసేన నేత దాడి

    కృష్ణా: మద్యం మత్తులో హోంగార్డ్‌పై జనసేన నాయకుడు దాడి చేశాడు. మచిలీపట్నం విశ్వబ్రాహ్మణ కాలనీలో ఈఘటన చోటుచేసుకుంది. అర్థరాత్రి నైట్‌బీట్‌లో ఉన్న హోంగార్డ్ జి.మోహనరావు వద్దకు 8వ డివిజన్ జనసేన నేత కర్రి మహేష్ బైక్‌పై వచ్చాడు. తాను వచ్చినప్పుడు లేచి నిలబడలేదంటూ హోంగార్డ్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో హోంగార్డ్‌ను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తనపై అకారణంగా మహేష్ దాడి చేశాడంటూ హోంగార్డ్ ఫిర్యాదుచేశారు.