నాగర్కర్నూల్: ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో నాగర్కర్నూల్ మండలానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. గత పాలకులు పేదల సమస్యలు పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని చెప్పారు. ఎన్నికల హామీ మేరకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.