నాగర్కర్నూల్: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మండలంలోని 41 మంది రైతు లబ్ధిదారులకు స్ప్రింక్లర్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రైతులు స్ప్రింక్లర్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణ రావు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.