నాగర్కర్నూల్: ఏబీవీపీ విద్యారంగ సమస్యలపై సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగారు బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి విద్యారంగ సమస్యలను విస్మరించారని మండిపడ్డారు.