మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మండపాలు, ఇళ్లలో గణనాథుని పూజల కోసం ప్రజలు అవసరమైన సామగ్రి కొనుగోలు చేయడానికి బయటికి రావడంతో ప్రధాన కూడళ్లు కిటకిటలాడుతున్నాయి. సాయంత్రం పూజలకు మండపాలు సిద్ధమవుతున్నాయి. ఈ పండుగ వాతావరణం జిల్లా అంతటా కనిపిస్తోంది.